Famous: Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు iiQ8

Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు iiQ8

 

అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా… ఆ మిట్టమధ్యాహ్నం వేళ (అభిజిత్‌లగ్నంలో) శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు.

 

ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే… భీషాష్టమి.

 

మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.

dharma swaroopudu bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు

 

Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు... - భీష్ముడు

Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు

మహాభారతంలో భీష్ముడిది కీలకమైనపాత్ర. ఏ రాచబిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది. కానీ చిరువయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు. దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహం జరిపిస్తాడు. ‘భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు’ అని దాశరాజు సందేహిస్తుంటే… తానసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆమెకు పుట్టిన బిడ్డల్లో చిత్రాంగదుడు గంధర్వులతో పోరులో మరణిస్తాడు. రెండోకొడుకు విచిత్రవీర్యుడు క్షయరోగి. అతడికి పిల్లనిచ్చేవారెవరూ దొరకరు. అప్పుడూ భీష్ముడే పూనుకుంటాడు. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకూ స్వయంవరం ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి ఆ కన్నెలను బలవంతంగా తీసుకోచ్చేస్తాడు. ముగ్గురిలో పెద్దదైన అంబ అప్పటికే మరొక వీరుణ్ని ప్రేమించిందని తెలుసుకుని ఆమెను మాత్రం విడిచిపెడతాడు. మిగతా ఇద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేస్తాడు. దురదృష్టవశాత్తూ విచిత్రవీర్యుడు కన్నుమూస్తాడు.

Yashoda, Yaagyavalkudu, యశోద యాజ్ఞవల్కుడు, Indian Culture – iiQ8

 

అంబికకూ, అంబాలికకూ పుత్రయోగం కలిగించి వంశాన్ని కాపాడమని భీష్ముణ్ని అడుగుతుంది సత్యవతి. సింహాసనంతోపాటు ఇద్దరు భార్యల్ని పొందే అవకాశాన్నీ కాదనుకుని తన ప్రతిజ్ఞకే కట్టుబడతాడు గాంగేయుడు. సద్యోగర్భం ద్వారా సత్యవతి కన్న వ్యాసుణ్ణి హస్తినకు రప్పిస్తాడు.

 

వ్యాసుడిద్వారా అంబిక అంబాలికలకు గుడ్డివాడైన దృతరాష్టుడు, పాండురోగంతో పాండురాజు పుడతాడు. వారి వివాహాల విషయంలోనూ కీలకపాత్ర భీష్ముడిదే.

 

గాంధార దేశాధిపతి సుబలుణ్ణి భయపెట్టి అతనికుమార్తె గాంధారిని తీసుకొచ్చి దృతరాష్టుడికిచ్చి పెళ్ళిచేస్తాడు.

Bali Chakravarthi Daana Mahima , King Bali, iiQ8

 

ద్రౌపదికి నిండుసభలో అవమానం జరుగుతుంటే ఉపేక్షించడంలోనూ భీష్ముడు ధర్మాణ్ని పాటించడమే కనిపిస్తుంది.

 

అంత్యకాలంలో యుధిష్టిరుడికి ధర్మబోధ చేస్తున్నప్పుడు ద్రౌపది… ‘నాడు నిండుసభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ఏమైనాయి ఈ ధర్మపన్నాలు’ అని అడుగుతుంది. ‘ఆనాడు నేను రాజధర్మానికి కట్టుబడ్డాను.

 

వారికి నేను సంరక్షుకుడిని, సేవకుడిని’ అని సమాధానమిస్తాడు భీష్ముడు. తాను కోరుకున్నప్పుడు చనిపోగల వరం ఉండికూడా చాలారోజులపాటు అంపశయ్యపై శరీరాన్ని శుషింపజేసుకోవడమే ఆ పాపానికి ప్రాయశ్చిత్తమనీ భావించాడు కాబట్టే ఆ శిక్ష వేసుకుంటాడు భీష్ముడు.

 

Viswamitra – విశ్వామిత్రుడు ,Indian Culture – iiQ8 , Vishwamithra

 

ఎన్నికష్టాలెదురైనా చలించక తుదికంటా ధర్మానికి మాత్రమే కట్టుబడిన ఆదర్శప్రాయుడు కనుకనే కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజును భీష్ముడి దగ్గరకు తీసుకెళ్ళి ధర్మబోధ చేయిస్తాడు శ్రీ కృష్ణుడు. అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి.

 

అలాంటిది ఆ వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు. అవే అనంతరకాలంలో విష్ణుసహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడంవిశేషం.

 

అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమినాడు, తర్వాత వచ్చే ఏకాదశినాడు విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు భక్తులు.

 

Uluchi Vaalmiki Vedi Vyaasudu, ఉలూచి , విఘ్నేశ్వరుడు, వాల్మీకి, వేది, వ్యాసుడు

ధర్మ స్వరూపుడుభీష్ముడు (Dharma Swaroopudu – Bhishma)

 

భీష్ముడు, అసలు పేరు దేవవ్రతుడు, మహాభారతంలో అత్యంత గౌరవనీయుడు, శాంతనుమహారాజు కుమారుడు. తండ్రి ప్రేమ కోసం అతడు వివాహం చేయకూడదని ప్రమాణం చేశాడు — అదే అతనికి భీష్మ ప్రతిజ్ఞ.
ఆ ప్రమాణం వల్లే అతడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ధర్మాన్ని పాటించడం, రాజధర్మాన్ని కాపాడటం, నిష్పక్షపాతంగా ఉండటం — ఇవన్నీ భీష్ముని జీవిత లక్షణాలు. అతడు నిజంగా ఒక ధర్మ స్వరూపుడు.

 

Bhishma, originally named Devavrata, was the son of King Shantanu in the Mahabharata. He is one of the most revered and noble characters in the epic. He took the terrible vow (Bhishma Pratigya) to remain celibate for life so his father could marry Satyavati. For this sacrifice, he was given the name “Bhishma” and a boon of Ichcha Mrityu — death at will.
He upheld truth, justice, loyalty, and dharma, and is rightly referred to as a “Dharma Swaroopa” (embodiment of righteousness).

How To Install IT – Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com

🌟 భీష్ముని ముఖ్య విశేషాలు:

అంశం వివరణ
అసలు పేరు దేవవ్రతుడు
తండ్రి శాంతనుడు
తల్లి గంగాదేవి
ప్రసిద్ధి భీష్మ ప్రతిజ్ఞ, ఇచ్చామరణం
పాత్ర ధర్మ స్వరూపుడు, నిజాయితీ గల యోధుడు
మరణం మహాభారత యుద్ధంలో, శ్రీకృష్ణుని అనుమతితో అర్జునుడి బాణాలపై శయనించి, ఉత్తరాయణం వరకు జీవించి మరణించాడు.

 

  1. భీష్ముడు ఎవరు?
    👉 మహాభారతంలో శాంతనుడి కుమారుడు, గంగాదేవి పుత్రుడు, ధర్మ స్వరూపుడు.
  2. భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి?
    👉 తండ్రి వివాహం కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలని ప్రమాణం చేయడం.
  3. అతనికిఇచ్చామరణం’ వరం ఎలా వచ్చింది?
    👉 తల్లి గంగా అతనికి వరంగా ఇచ్చింది — తన చావును తానే ఎప్పుడైనా నిర్ణయించగలగడం.
  4. భీష్ముడు ధర్మాన్ని ఎలా పాటించాడు?
    👉 పాండవులా అయినా, కౌరవుల పక్షాన యుద్ధం చేయడం ద్వారా రాజధర్మాన్ని కాపాడాడు.
  5. భీష్ముడి మరణం ఎలా జరిగింది?
    👉 అర్జునుడి బాణాలతో కాటిన మంచంపై శయనించి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత తన ప్రాణం విడిచాడు.

Kuwait Bus Route – Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

📖 భీష్ముడి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

  • భగవద్గీత ఉపదేశం ప్రారంభానికి ముందు భీష్ముడి ధైర్యం మరియు ప్రత్యుత్తరం అర్జునునికి శక్తిని ఇచ్చింది.
  • భీష్మ పర్వం (మహాభారతంలోని భాగం)లో ఆయన పాడిన విష్ణు సహస్రనామం అత్యంత పవిత్రమైనది.

Dharma Swaroopudu Bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Spread iiQ8

April 4, 2016 8:37 PM

936 total views, 1 today