Sri Bhagavad Gita Telugu font, Part 17, iiQ8, Bhavad Geetha
శ్రద్దాత్రయ విభాగ యోగము (17 వ అధ్యాయము)
Sri Bhagavad Gita Telugu font, Part 17, iiQ8, Bhavad Geetha
అర్జునుడు:
కృష్ణా!శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా,రాజసులా,తామసులా?వీరి ఆచరణ ఎలాంటిది?
కృష్ణుడు:
పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక,రాజస,తామస శ్రద్ధలు ఏర్పడతాయి.
స్వభావంచే శ్రద్ధ పుడుతుంది.శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు.శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు.
సాత్వికులు దేవతలనీ,రాజసులు యక్షరాక్షసులనీ,తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు.
శాస్త్రనిషిద్దమైన తపస్సును,దారుణ కర్మలను చేసేవాళ్ళూ,దంభం,అహంకారం తో శరీరాన్నిశరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు.
ఆహార,యజ్ఞ,తపస్సు,దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి.
ఆయుస్సునూ,ఉత్సాహాన్ని,బలాన్ని,ఆరోగ్యాన్ని,సుఖాన్ని,ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి,చమురుతో కూడి,పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం.
చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని,రోగాలనూ,చింతనీ కల్గిస్తాయి.
చద్దిదీ,సారహీనమూ,దుర్వాసన కలద…
Read more
about Sri Bhagavad Gita Telugu font, Part 17, iiQ8, Bhavad Geetha