Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People) Why are you supporting Adani *నన్ను ఒక ఫ్రెండు ఇలా ప్రశ్నించాడు.* Why supporting Adani - నువ్వు అంబానీ ఆదానే టాటా బిర్లా వంటి పెద్ద పెద్ద కంపెనీలను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్? నువ్వు అంబానీ ఆదానే టాటా బిర్లా వంటి పెద్ద పెద్ద కంపెనీలను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్? వాళ్లు చిన్న చిన్న కంపెనీలను లాగేసుకుని అంతలా ఎదిగిపోయారు? వ్యాపారంలో అలా మోనోపలిగా ఉంటూ అన్ని వ్యాపారాలను తమ గుప్పెట్లో ఉంచుకోవడం న్యాయమేనా? దేశంలో రెండు మూడు కంపెనీలు ఇలాగ దేశంలో గల వ్యాపారాలు అన్నిటిని గుప్పెట్లో పెట్టేసుకుంటే దేశానికి ప్రమాదం కాదా అని ప్రశ్నించాడు. *నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న.* *కానీ ఈ ప్రశ్న మనకు ఎప్పటి నుంచి వచ్చింది?* *2014 తరువాతే ఎందుకు వచ్చింది,?* *అదీ ఎక్కువగా రెండు దేశీయ కంపెనీల మీద మాత్రమే ఎందుకు వచ్చింది?* *ఈ రెండు మూడు వ్యాపార సంస్థలు మాత్రమే దేశంలో కొన్ని రకాల వ్యాపారాలను గుప్పెట్లో పెట్టుకున్నాయా? లేక ఇతర కంపెనీలు కూడా కొన్ని వ్యాపారాలు పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్నాయా?* *ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం.* *మొబైల్స్:* ఇంకా విచిత్రం ఏమిటంటే ఇలా చైనా కంపెనీలు మీద మన ED, IT విభాగాలు దాడులు చేస్తే ఇప్పుడే ఎదుగుతున్న భారత్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదం, విదేశీ పెట్టుబడులు అగిపోతాయి అని కమ్మి న్యూస్ పోర్టల్స్ THE PRINT, THE WIRE వంటివి సన్నాయి నొక్కులు నొక్కారు. *కూల్ డ్రింక్స్:* *FMCG అంటే సబ్బులు, షాంపు, తల నూనెలు, సౌందర్య సాధనాల మొ. వ్యాపారం:* *చిన్న పిల్లల పాల గుండ అదే బేబీ ఫుడ్స్:* *బిస్కెట్లు, చాక్లెట్ లు:* మన చంటి పిల్లలకు 70 సం. లుగా ఎడా పెడా పూసేసిన జాన్సన్ పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఈ మధ్యే బయటపడింది. కేసు నడుస్తోంది. అది తెల్లోడి కంపనీ కాబట్టి మీడియాలో ఎక్కువగా వార్తలు రాలేదు. అదే పతంజలి కంపనీ అయితే మీడియా నిండా అదే వార్త ఉండేది. నాకు టాటా బిర్లా అంబాని ఆడాని చుట్టాలు కారు. నేను ఆ కంపెనీలలో ఉద్యోగం చేయడం లేదు. నా బాధ అంతా స్వాతంత్రం వచ్చి 75 సం. లు అయినా ఒక్కటి అంటే ఒక్క భారతీయ కంపెనీ అయినా అంతర్జాతీయ కంపెనీగా ఎందుకు ఎదగలేకపోయింది? ఉదయం లేచిన దగ్గర నుండి నోట్లో పెట్టుకునే టూత్ బ్రష్ ,పేస్ట్ నుండి రాత్రి పడుకునే ముందు వాడే కండోమ్ వరకు మనకు ఇప్పటికి MNC లు తయారు చేసే వస్తువులే దిక్కు. ఎందుకు మన దేశీయ కంపెనీలు MNC లు స్థాయికి ఎదగ లేకపోతున్నాయి? మన కంపెనీలు అనే సరికి మనకు చిన్న చూపు, భారతీయ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు అందరూ దొంగోళ్లు అనే అభిప్రాయం కలగ చేశారు భారతీయ కమ్యూనిస్ట్ లు. ఈ భారతీయ కమ్యూనిస్ట్ లు ఏనాడు అయినా ఏ విదేశీ కంపెనీల మీద గట్టిగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయా? MNC కావచ్చు దేశీయ కంపనీ కావచ్చు, వ్యాపారం అన్నాక లాభాపేక్షకు అందరూ ఫాలో అయ్యేవి సుమారుగా ఒకే పద్ధతులు ఉంటాయి. కానీ అవి విదేశీ కంపెనీలు కాబట్టి అవి ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేసుకోవచ్చు, లెక్కలు రాసుకోవచ్చు. కోట్ల లాభాలు తమ దేశాలకు పట్టుకుపోవచ్చు. మనకు ఎప్పుడూ నొప్పి బాధ అనిపించదు. కానీ దేశీయ కంపెనీలు అనే సరికి ముప్పేట దాడి. *మళ్ళీ ఏడుపులుకు రెడీ అయిపోండి.* *అబ్బే అంబాని తయారు చేసిన డ్రింక్ తాగి దేశానికి డబ్బులు ఎందుకు ఇస్తాం, అంబానీ మీద, మోడీ మీద కోపం కొద్దీ పెప్సీ మాత్రమే తాగి అమెరికా కంపెనీకి మాత్రమే వ్యాపారం ఇస్తాం అని చెప్పి దేశభక్తి నిరూపించుకోండి.* *ఒక్క దేశీయ కంపెనీలను మాత్రమే ప్రశ్నిస్తుంటాం.* *విదేశీ కంపెనీలు పై పల్లెత్తు మాట ఆనం.* *ఎక్కడ నుండి ఎలా అంటుకుంది ఈ జబ్బు మనకు?* *మన ఈ ఆలోచనా విధానమే విదేశీ కంపెనీలకు శ్రీరామరక్ష.* - చాడా శాస్త్రి 👇 మరిన్ని పోస్ట్లు కాపీ చేసి షేర్ చేయవచ్చు https://indianinq8.com/Hindu
గత సం.₹1.20లక్షల కోట్ల విలువ గల మొబైల్ ఫోన్లు దేశంలో అమ్మారు. చెప్పుకోదగ్గ ఒక్క దేశీయ కంపనీ లేదు. చైనా, కొరియా కంపెనీలు మోనోపలి. రక రకాల తప్పుడు పద్ధతులు, దొంగ షెల్ కంపనీల ద్వారా ఒక్క వివో కంపనీ గత 3 సం. లలో ₹62,000 కోట్లు చైనా పట్టుకుపోయింది అని ED దాడుల ద్వారా తెలిసింది. మిగతా చైనా మొబైల్ కంపెనీలు కూడా వందల వేల కోట్లలో ఈ దేశ టాక్స్ లు ఎగ్గొట్టడానికి రక రకాల పద్ధతులు అవలంబించారు. కానీ మన మీడియాలో వార్తలు రావు. దేశాన్ని దోచేస్తున్నారు అని ఎర్ర ప్రేమికుల సోషల్ మీడియా పోస్టులు ఉండవు.
ప్రస్తుత వ్యాపారం సం.కి ₹60,000 కోట్లు. మోనోపలి పెప్సీ, కోకోకోలా ఈ రెండు కంపెనీలు విదేశాలవి. దేశంలో గల కొన్ని వందల చిన్న చిన్న కూల్ డ్రింక్ కంపెనీలను కొనేసి దేశంలో కూల్ డ్రింక్ వ్యాపారం తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆ డ్రింక్స్ లో పురుగుమందు అవశేషాలు, హానికరమైన ఆసీడ్స్ వాడుతున్నారు అని ఆరోగ్య నిపుణులు చెపుతూనే వున్నారు. రంగు నీళ్లు అమ్మి మన దగ్గర నుండి దశాబ్దాలుగా వేల కోట్లు దోచుకు పోతూవున్నా మనకి ఎప్పుడూ గుండె మండలేదు. అయినా మనకి చల్లగా కమ్మగా ఉంది.
దీనిలో హిందూస్తాన్ లీవర్ మోనోపలి. గత సం. 52,000 కోట్లు టర్నోవర్. వాళ్ళ దేశం పట్టుకుపోయిన లాభం ₹6000 కోట్లు పై మాటే. అంటే గత 70 సం.లలో ఎన్ని వేల కోట్ల లాభాలు పట్టుకు పోయిందో ఊహించండి. వందలాది చిన్న చిన్న కంపెనీలను టేక్ ఓవర్ చేసి ఎదిగింది. అంతే కాదు. మన నల్లోళ్లకు బ్రాండ్ పిచ్చి కాబట్టి, ఏ చిన్న ఊర్లోనో చిన్న కంపనీ తయారు చేసిన సబ్బుకి, తల నూనెకి వాడి బ్రాండ్ పేరు పెట్టి రెండింతలు రేట్ పెట్టి అమ్ముతాడు. లక్స్ సబ్బు వాడితే చర్మం తెల్లబడుతుంది, ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే మొహం చంద్ర బింబం అవుతుంది అని వాడు 70సం. లుగా అబద్దాలు చెప్పి వస్తువులు అమ్మినా అన్ని మూసుకుని నోరెత్తకుండా అవే కొనుక్కుంటాం. వాడు తెల్లోడు మనల్ని పాలించినవాడు. వాడికి నల్లోడిని దోచుకునే హక్కు ఉంది అని మన బానిస బుర్రలు నోరు ఎత్తవు.
ఈ వ్యాపారంలో మోనోపలి నెస్లే కంపనీ. గత ఏడాది టర్నోవర్ ₹40,000 కోట్లు. 400 గ్రాముల బేబీ మిల్క్ పౌడర్ పేకెట్ ₹550. నవ రంధ్రాలు మూసుకుని కొంటున్నాం. వీడూ అంతే చాలా చిన్న కంపెనీలను కలిపేసుకున్నాడు.మనకు నొప్పి అనిపించి ఒక్క సారీ కేర్ అని ఏడవలేదు.
దేశంలో బ్రిటానియా టర్నోవర్ ₹15వేల కోట్లు. చిన్న ఊర్లలో పెట్టిన చాలా బిస్కెట్ కంపెనీలను టేక్ ఓవర్ చేసాడు. అలాగే చిన్న ఊర్లలో తయారైన బిస్కెట్లకి తమ బ్రాండ్ పేరు పెట్టి అమ్మేసుకుంటున్నాడు.
అలాగే కాడ్బరీ చాకలేట్ టర్నోవర్ గత సం.$1.2బిలియన్లు. చాక్లెట్ వ్యాపారంలో ఆల్మోస్ట్ మోనోపోలీ.
ఎందుకంటే, దేశంలో 60 వేల కోట్ల కూల్ డ్రింక్స్ వ్యాపార మోనోపలిని కొట్టడానికి రిలయన్స్ గ్రూప్ అడుగులు వేస్తోంది. కాంపా కోలా అనే మూతబడిన పరిశ్రమని, ఆ బ్రాండ్ ని స్వంతం చేసుకుంది. త్వరలో పెప్సికి, కోకోకోలా కి పోటీగా తమ ఉత్పత్తులు మార్కెట్ లో విడుదల చేస్తుంది. పెప్సీ వంటి MNC లను ఎదుర్కోవాలి అంటే తూర్పుగోదావరి జిల్లా పాపులర్ బ్రాండ్ ఆర్తోస్ వంటి కంపెనీల బలం చాలదు. వాటికి సరి తూగే కంపెనీలు మాత్రమే వాటినిఎదుర్కోగలవు. అందుకే రిలయన్స్ వంటి కంపెనీలు ప్రయత్నిస్తేనే విజయం సాధించగలవు.
What is FORUM ?
Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.