Forum

Christianity - ఎట్ట...
 
Notifications
Clear all

Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People)

Christianity - ఎట్టేట్టా.....క్రైస్తవ్యానికి ఏసుకి అసలు సంబంధమే లేదా... అయ్యో...... ఒక్కసారి క్రైస్తవ్యం యొక్క మూలసిద్ధాంతాలు చూద్దాం

1 Posts
1 Users
0 Reactions
1,610 Views
99ce4cddd7dc6b1ff00d1dda09fcf905423ebebd03b60f450c601c88fb78ec61?s=80&d=mm&r=g
Posts: 42
Admin
Topic starter
(@hr)
Estimable Member
Joined: 8 years ago

ఎట్టేట్టా.....క్రైస్తవ్యానికి ఏసుకి అసలు సంబంధమే లేదా... అయ్యో......

ఒక్కసారి క్రైస్తవ్యం యొక్క మూలసిద్ధాంతాలు చూద్దాం

హిందూ బంధువులారా 🙏 మన మధ్యలో సెక్యులర్ గా ఉన్న హిందువులకు చైతన్యం రావాలి అనేదే నా ప్రయత్నం.🙏

మన దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ స్వదేశాన్నీ సంప్రదాయాల్ని చులకన చేస్తూ విమర్శిస్తూ నీచ భావంతో ఏమైనా నా కంటపడితే. గువ్వలో గునపం దింపుతా. 💪

మీకు నా నుండి ఏమైనా సమాచారం కావాలంటే 👇 వాట్సాప్ నంబర్ కు మేసేజ్ చెయ్యండి. వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లో చేరేవారు ఈ నంబరుకు 9398699797 జై శ్రీ రాం అని మెసేజ్ పెట్టండి.

ఎట్టేట్టా.....క్రైస్తవ్యానికి ఏసుకి అసలు సంబంధమే లేదా... అయ్యో......
ఒక్కసారి క్రైస్తవ్యం యొక్క మూలసిద్ధాంతాలు చూద్దాం

1. యేసు కన్యకు పుట్టాడు కాబట్టి పరిశుద్ధుడు ( అంటే సంభోగం ద్వారా పుట్టలేదు కాబట్టి )

2. మన పాపాల కోసం యేసు శిలువను ఎక్కాడు. ఆయన రక్తమే మనకు పాప పరిహారం.

3. యేసు చనిపోయి మూడవరోజు, పునరుత్థానుడయ్యాడు

4. యేసు రెండవ రాకడలో వచ్చి మనకు తీర్పును తీరుస్తాడు.
5. ఇవన్నీ నమ్మని వారు శిక్షించబడుదురు, నమ్మిన వారు రక్షించబడతారు.
వీటినే క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతాలుగా చెప్పవచ్చు. ఈ సిద్ధాంతాలపైనే క్రైస్తవ నిర్మితమై ఉంది.

అయితే ఈ సిద్ధాంతాలన్నిటిని యేసే చెప్పాడని మీరు అనుకుంటే బైబిల్ లో కాలేసినట్టే. వీటిలో ఏ ఒక్క సిద్ధాంతము యేసు చేత చెప్పబడలేదు. ఈ సిద్ధాంతాలన్నిటినీ యేసు శిష్యులు మరియు పౌలు రూపొందించారు. వీటినే మన పాస్టర్లు దశమ భాగాల కోసం అమాయపు గొర్రెలతో ఊదర కొడుతూ ఉంటారు.

ఈ సిద్ధాంతాలు ఆది యూదా మతానికి విరుద్ధము మరియు యేసు బోధనలకు కూడా విరుద్ధమే. యేసు, తాను ఏ రోజు దేవుడినని ప్రకటించలేదు. పరలోకంలో ఉన్న తండ్రి మాత్రమే అద్వితీయ దేవుడని చెప్పాడు. కానీ, యేసు చనిపోయిన తర్వాత యేసు శిష్యులు ఆయన్ని దేవుడుగా మార్చే క్రమంలో ఈ సిద్ధాంతాలను పొందుపరిచారు.

ఏసు రెండో రాకడలో వచ్చి ఎవరైతే తనని విశ్వసించారో వారందరినీ స్వర్గానికి పంపిస్తాడు,నమ్మని వారిని నరకంలో పడేస్తాడు అని చెప్తూ ఉంటారు పాస్టర్లు. అలా నరకంలో పడకుండా ఉండాలంటే మీరు యేసుని విశ్వసించండి. ఈరోజే మీరు ఆచరిస్తున్న మతాన్ని వదిలేసి యేసుని నమ్ముకోండి అని చెప్తూ ఉంటారు. మరి బైబిల్ లో యేసు ఈ తీర్పు దినం గురించి ఏం చెప్పాడో చూద్దాం.
(మతయ్య సువార్త :25: 32,33)

అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి
తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.

ఏసు రెండో రాకడలో వచ్చినప్పుడు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరచినట్లుగా గొర్రెలను కుడివైపు మేకలను ఎడమవైపు నిలబెట్టును. ఆయన చేసిన బోధనలన్నీ కూడా ఉపమాన రీతిగానే ఉంటాయి. ఇక్కడ గొర్రెలు అంటే స్వర్గానికి వెళ్లేవారు,మేకలు అంటే నరకానికి వెళ్లేవాళ్లు.

 

అలా వేరుపరిచిన గొర్రెలతో అంటే నీతిమంతులతో యేసు ఇలా చెప్తున్నాడు. మీరందరూ నా పరలోకానికి అర్హులు, ఎందుకంటే, నేను మీ వద్దకు ఆకలితో వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టారు, దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటే మీ ఇంట చేర్చుకున్నారు, దిగంబరినై వచ్చినప్పుడు బట్టలిచ్చారు, రోగిగా ఉన్నప్పుడు సేవలు చేశారు, చెరసాలలో ఉన్నప్పుడు నాకోసం వ్యాజ్యం ఆడారు. అందుకే మీరందరూ పరలోకానికి అర్హులు అని చెప్పాడు.

అప్పుడు ఆ నీతిమంతులు ప్రభువా నీవు ఎప్పుడు వచ్చితివి, మేము ఎప్పుడు నీకు సహాయం చేసితిమి అని అడిగారు. దానికి ఏసు అల్పులైన నా సహోదరులకు మీరు చేసితిరి, కాబట్టి నాకు కూడా చేసినట్లే అని చెప్పాడు.

అలాగే,మేకల వైపు అంటే నీతిపరులు కాని వారి వైపు తిరిగి, మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి నరకానికి అర్హులు అని చెప్పాడు.
నేను ఈ కథని ఎక్కడో కల్పించి చెప్పట్లేదు. బైబిల్ నుంచే తీసుకొచ్చి చూపిస్తున్నాను. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త ఐదవ అధ్యాయము 32 వ వచనం నుంచి ఉంటుంది.
దీన్నిబట్టి ఏసు మనకి తీర్పు తీర్చే రోజు ఏ విధంగా ఆలోచిస్తాడో చాలా క్లియర్ గా కనిపిస్తుంది బైబిల్ లో.

ఎవడైతే తన పక్కన వాడికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడో వాడే నీతిమంతుడిగా ఎంచబడి పరలోకానికి అర్హుడు అవుతాడని చెప్తున్నాడు యేసు.
అదేంటి, ఇది సనాతన ధర్మం నుంచి తీసుకున్న సిద్ధాంతమే కదా అనుకుంటున్నారా. అవును మన సనాతన ధర్మం కూడా ఇదే వివరించింది. ఏసు కూడా అదే చెప్పాడు. కానీ యేసు శిష్యులు గాని పౌలు గాని క్రైస్తవ యొక్క మూల సిద్ధాంతాలలో ఎక్కడ దీన్ని చేర్చలేదు. ఎందుకో తెలుసా.?

మనం మన ధర్మం లో దేవుణ్ణి, చెట్టులోనూ, పుట్టలోనూ, పిట్టలోను, రాయిలోనూ , తోటి మనిషిలోనూ చూస్తాము. కానీ క్రైస్తవ్యం అలా దేవుడిని అందరిలో చూడటానికి అనుమతి ఇవ్వదు. ఎందుకంటే వారి దృష్టిలో, వారి దేవుడు కేవలం పరలోకంలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు, తప్ప ప్రతి రాయిలోనూ అతను ఉండడు. అందుకే మనం విగ్రహారాధన చేస్తున్నప్పుడు వీళ్ళు విమర్శిస్తారు. దీని వెనక ఉన్న కిటుకేమిటో చూడండి.

మోషే యూదా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు కానీ, యేసు శిష్యులు క్రైస్తవ్యం అనే వంటకాన్ని తయారు చేసినప్పుడు గాని, అప్పటికే ప్రపంచంలో చాలా రకాలైన మతాలు ఉన్నాయి. ఆ మతాలలో మూల సిద్ధాంతాలన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అన్ని కూడా దాదాపుగా సనాతన ధర్మంలో ఉన్న సిద్ధాంతాలనే పాటిస్తున్నాయి. మరి ఇన్ని మతాల మధ్య మళ్లీ అదే సిద్ధాంతాలతో అదే మతాన్ని ప్రతిపాదించడం వల్ల ఎవరు ఆకర్షితులు అవ్వరు. అందుకే అప్పటికే మనుగడ లో ఉన్న మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా కొత్త మతాలని ప్రతిపాదించారు.

కానీ పాపం, యేసుకి తాను చనిపోయిన తర్వాత ఇంకొక మతం పుడుతుంది అని తెలియక ఆయన, తన దారిలో తాను బోధనలు చేసుకుంటూ వెళ్ళాడు. ఏసు తాను చెప్పిన బోధనలో ఎక్కడా కూడా తాను పాపం కోసం సిలువ ఎక్కబోతున్నట్టు, తనని నమ్మిన వారిని మాత్రమే స్వర్గానికి తీసుకెళ్లబోతున్నట్లు ఎక్కడా చెప్పలేదు.

నీతోటివాడు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తీర్చినవాడు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు నా దృష్టిలో అని చెప్పాడు. మరి ఇలా తోటి వాడు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం తీర్చడం కోసం మతం మారనక్కర్లేదు కదా. మనం ఏ మతాన్ని ఆచరిస్తూ ఉన్నా, అతని కష్టాన్ని తీర్చవచ్చు. కానీ అలా చెప్తే ఈ పాస్టర్లకి దశమ భాగాలు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే వీరు యేసు బోధనలకు విరుద్ధంగా బోధన చేస్తూ అమాయక ప్రజల్ని గొర్రెలుగా మారుస్తూ పబ్బం గడుపుకుంటారు.

గొర్రెల్లారా, దయచేసి అర్థం చేసుకోండి, యేసుకి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధమూ లేదు. చర్చిలు అల్లిన ఈ సాలెగూడు నుంచి త్వరగా బయటపడి స్వధర్మం వైపు అడుగులు వేయండి.

జంపింగ్ జపాంగ్😆😆😆

 

Credits to - SHIVAJI SENA

Please Subscribe & Share   https://www.youtube.com/@sarinodu2021      

 

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu




What is FORUM ?

Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.

Spread iiQ8